అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు వివిధ శాఖల పద్దులపై చర్చల వరకు కేంద్రంపై వరుస విమర్శలు వినిపిస్తున్నాయి.మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు సందర్భానుసారం కేంద్రాన్ని విమర్శిస్తు న్నారు.పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం ఆ పార్టీ ఎంపీలు సైలెంట్ గా ఉన్నారు. దాదాపు సగం మంది హాజరు కావడమే లేదు. చర్చించడానికి పెద్దగా అంశాలే లేవంటున్నారు.

గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం పై నిరసన వ్యక్తం చేసిన టిఆర్ఎస్ ఎంపీలు ఈసారి మాత్రం మౌనం వహించారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందడంతో టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం మారింది. సీఎం కేసీఆర్  అస్వస్థతకు గురై నాలుగైదు  రోజులు విశ్రాంతిలో ఉన్నారు. దీంతో ఎంపీలకు దిశానిర్దేశం చేయలేకపోయారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు క్లారిటీ లేకుండా పోయింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఫెడరల్ స్ఫూర్తి లేకుండాపోయింది.రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతుందని,తెలంగాణా పట్ల వివక్ష కనిపిస్తున్నది అని స్వయంగా సీఎం కేసీఆర్ గత నెల 1వ తేదీ సాయంత్రం సుదీర్ఘ వీడియో సమావేశంలో మోడీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన అంశాలను సాధించుకోవాలని, కేంద్రం మెడలు వంచాలని, పార్లమెంటు సమావేశాల్లో ఒత్తిడి పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అదే తీరులో నిరసనలు చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచారు.గత నెలలో మొదలైన బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ మొదలైంది. కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు నోరెత్తడం లేదు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదాంటూ టీఆర్ఎస్ తన వాదనను బలంగా వినిపిస్తున్నా పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ని కార్నర్ చేయడానికి అయితే ఈ సమావేశాలను వినియోగించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందడంతో కేంద్రంతో అప్పటివరకు ఉన్న ఫ్రెండే రిలేషన్స్ మారిపోయాయి. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఉప్పు నిప్పులా గా మారిపోయాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో మరింత దూకుడుగా వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది.

 పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను సైతం అందుకు వాడుకోవాలనే వ్యూహంలో ఉన్నప్పటికీ సీఎం విశ్రాంతిలో ఉండటంతో ఘాటు వ్యాఖ్యలు అతనికి మాత్రమే పరిమితమయ్యాయి.బిజెపిని కూకటివేళ్లతో బంగాళాఖాతంలోకి వేయాలి.. దాన్ని నిర్మూలిస్తేనే దేశ ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది.. ఇలాంటి కామెంట్స్ చేసినా నాలుగు రాష్ట్రాల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ సైలెంట్ గా ఉండటానికి కారణం సీఎం అనారోగ్యంతో విశ్రాంతిలో ఉండడమా లేక వ్యూహాత్మక ఎత్తుగడా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: