జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎల్లోమీడియా ఎంతగా ఓవర్ యాక్షన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందుకు తాజా ఉదాహరణ బయటపడింది. ఎసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స (ఏడీఆర్) నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్ధలు సంయుక్తంగా రెండుజాబితాలను విడుదల చేశాయి. మొదటిదేమో దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక సీఎం ఎవరు ? అలాగే సీఎంలకు ఉన్న అప్పులు ఎంత ? అనేది ఒక జాబితా. ఇక రెండో జాబితా ఏమిటంటే దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ఎంఎల్ఏ ఎవరు ?





నిజానికి రాజకీయనేతలు ఎన్నికల అఫిడవిట్లలో ఇచ్చే వివరాలన్నీ పూర్తి నిజాలే అనుకునేందుకు లేదు. ఏదో ఇవ్వాలి కాబట్టి తమ ఆడిటర్లతో లెక్కలు తయారుచేయించి మొక్కుబడిగా ఏదో ఒకటి ఇచ్చేస్తారు. ఆ లెక్కలనే పై సంస్ధల్లాంటివి తీసుకుని మీడియాకు రిలీజ్ చేస్తుంటాయి. నిజానికి దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగముండదు. కాకపోతే తమ ముఖ్యమంత్రికి ఇన్ని ఆస్తులున్నాయా ? ఇంత అప్పుందా ? అని కాసేపు కాలక్షేపంగా మాట్లాడుకోవటానికి మాత్రమే పనికొస్తుంది.





తాజా జాబితాలో ముఖ్యమంత్రులందరిలోకి జగన్మోహన్ రెడ్డి రిచ్చెస్ట్ సీఎం అని తేల్చింది. జగన్ ఆస్తులు రు. 510 కోట్లట. అలాగే మిగిలిన 29 మంది సీఎం ఆస్తులు కూడా చెప్పింది. దీన్ని ఎల్లోమీడియా బాగా హైలైట్ చేసింది.





అయితే ఈ సంస్ధలే రిలీజ్ చేసిన రిచ్చెస్ట్ ఎంఎల్ఏల్లో చంద్రబాబునాయుడుది దేశంలోనే మూడో ప్లేసు. చంద్రబాబు ఆస్తులు రు. 668 కోట్లు. అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఆస్తులకన్నా ఎంఎల్ఏగా చంద్రబాబు ఆస్తులు రు. 158 కోట్లు ఎక్కువ. జగన్ కు అన్ని ఆస్తులున్నాయంటే వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఉండచ్చు. మరి చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తనకు చేతికి ఉంగరం లేదు, వాచీ కూడా లేదని బీద మాటలు మాట్లాడుతుంటారు కదా ఇన్ని వందల కోట్లు ఎలావచ్చాయి ? ఈ విషయాన్ని ఎల్లోమీడియా ప్రముఖంగా చెప్పాలి కదా. జగన్ ఆస్తులకన్నా చంద్రబాబు ఆస్తులే ఎక్కువైనపుడు అసలు ప్రచురించాల్సిన వార్తే చంద్రబాబు మీదకదా ? జగన్ ఆస్తులను ప్రకటించి చంద్రబాబు గురించి రాయలేదు. ఇందుకే దీన్ని ఎల్లోమీడియా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: