మేక్-ఇన్ ఇండియాను ఇంకొంత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం, కరోన సెకండ్ వేవ్ దెబ్బకు కొద్దిగా వెనక్కి తగ్గవలసి వస్తుంది. భారతీయ టీకాలతో ప్రపంచాన్ని ముంచెత్తాలన్న భారత్ ఆకాంక్షకు ఆదిలోనే హంస పాదు అడింది. మన ఆశయానికి వ్యతిరేఖ దిశలో విదేశీ టీకాలనే మన దేశంలోకి అనుమతించక తప్పని దుస్థితికి భారత్ తలొగ్గవలసి వచ్చింది. 




ఇన్నాళ్లు కేంద్రం భారత్ లో తయారు చేసిన కోవీషిల్డ్, కోవాగ్జిన్ టీకాలనే భారతీయులకు పంచాలని, వేరే ఏ టీకాలకు దేశంలో అనుమతి ఇవ్వలేదు. అమెరికాలో ఇప్పటికే ఆమోదం పొందిన ఫైజర్, మోడెర్నా లాంటి ప్రఖ్యాత టీకాలకు కూడా దేశంలో అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ ట్రయల్స్ నిర్వహించా లని మెలిక పెట్టాయి.




కానీ ఇప్పుడు ఉదృతమైన సెకండ్ వేవ్ తో అందరి ప్రాణాలకు ముప్పు రావటంతో పాటు భారతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు ధరలను ఇష్టానుసారంగా పెంచి సరిపడా టీకాలు ఉత్పత్తి చేయలేక పోతున్నాయి. అందరికీ అందించ లేక పోతున్నాయి. ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ధాటికి దేశం అల్లకల్లోలంగా మారింది. 18-45 ఏళ్ల వారికి టీకా వేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మే 1న ప్రారంభించినా టీకాల కొరత తో అది సాధ్యపడడం లేదు. పైగా సెకండ్-వేవ్ తో ఇప్పుడు పెద్దసంఖ్యలో రోగులు ఆస్పత్రుల పాలై, ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే కాని సమాభావం వలన కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.




అమెరికా ఎఫ్.డీ.ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ టీకాలనైనా దిగుమతి చేసు కోవచ్చని కేంద్రం ప్రకటన చేసింది. వీటికి ఒకటి, రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని తెలిపింది. టీకాల దిగుమతి కోసం ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగులో లేవని కేంద్ర స్పష్టం చేసింది.

విదేశాల్లో పంపిణీ అవుతున్న టీకాల దిగుమతికి ఒకటి రెండు రోజుల్లోనే కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందని నీతి అయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు తమవద్ద పెండింగులో లేవని చెప్పారు.




ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు మన విదేశాంగ శాఖను సంప్రదించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ సైతం భారత్ లో టీకా ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఇక కేంద్రం-భారత్ బయోటిక్ కలిసి అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తయారీని ఇతర సంస్థలకు అప్పగించి భారీగా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇక ఇవే కాదు, రష్యా అభివృద్ధి చేసిన “స్పుత్నిక్ - V” టీకా వినియోగానికి భారత్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం నుంచి రష్యా టీకాలు భారతీయ మార్కెట్ ను ముంచెత్తనున్నాయని వెల్లడించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్  భారత్ లో ఈ టీకాల ఉత్పత్తి పంపిణీని చేపట్టనుంది.



ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన అన్ని వ్యాక్సిన్లను అనుమతివ్వడం కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తద్వారా టీకాల డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా అయ్యి భారత్ లోని అందరికీ వేగంగా వ్యాక్సిన్లు లభించనున్నాయి.  టీకాల కొరతతో అల్లాడుతున్న దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా అన్ని వ్యాక్సిన్లకు ఆమోదించిన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని అందరి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికైనా రాబోయే ఆరు నెలల్లోనే దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తే ఈ కరోనాను తరిమి కొట్టవచ్చని, మూడో వేవ్ ను అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: