జగన్ ప్రకటనతో ఒక్కసారిగా క్యాబినెట్ రేసు మొదలైంది..జూన్ లోనే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పడంతో ఆశావాహులు మంత్రి పదవి దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు...ఈ సారి ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు..ఈ సారి లాస్ట్ అవకాశం అన్నట్లు ప్రయత్నిస్తున్నారు...ఎందుకంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో క్లారిటీ లేదు...ఒకవేళ వచ్చిన ఎమ్మెల్యేలుగా మళ్ళీ గెలుస్తామో లేదో అని అనుకుని..ఇప్పుడే మంత్రి పదవి దక్కించుకుంటే బెటర్ అని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో కూడా పలువురు ఆశావాహులు క్యాబినెట్ రేసులో పోటీ పడుతున్నారు...ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు..కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని...జగన్ క్యాబినెట్ లో ఉన్నారు. అయితే ఈ సారి అందరినీ సైడ్ చేస్తే వీరు పక్కకు తప్పుకోవడం గ్యారెంటీ..కానీ ఎవరినైనా మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటే చెప్పలేం. సరే ఎవరిని ఉంచుతారు, ఎవరిని తీసేస్తారు అనే విషయం పక్కన పెడితే... కృష్ణా జిల్లాలో మాత్రం మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు.

అలా పదవి కోసం ట్రై చేస్తున్న వారిలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ముందు వరుసలో ఉన్నారు...ఈయన మొదటే పదవి ఆశించారు..కానీ యాదవ సామాజికవర్గం నుంచి అనిల్ ని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఇప్పుడు అనిల్ ని సైడ్ చేస్తే తనకే పదవి వస్తుందని సారథి భావిస్తున్నారు. ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం కాపు కోటాలో పదవి దక్కించుకోవడం చూస్తున్నారు.

ఇటు గౌడ వర్గం నుంచి పదవి కోసం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ట్రై చేస్తున్నారు. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు ట్రై చేస్తున్నారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సైతం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు...ఇలా కృష్ణా జిల్లాలో పలువురు నేతలు క్యాబినెట్ రేసులో ఉన్నారు..మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: