
తాజాగా క్వాంటీస్ అనే ఆస్ట్రేలియా విమానాయన సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ను చైనా జామ్ చేసిందని ఆరోపించింది. చైనా దక్షిణ సముద్రం నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తున్నాయి. చైనా యుద్ధ నౌకల స్థావరానికి మీ విమానాలు దగ్గరగా ఉన్నారని ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని కొన్ని వాయిస్ లు వినబడేలా చైనా చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ పెడరేషన్ పైలెట్స్ అసోసియేషన్ సంస్థ చెప్పింది. ఈ సంస్థలో 100 దేశాలకు సంబంధించిన పైలెట్లు, దాదాపు లక్ష మంది పైలెట్లు ఉంటారన్నారు. రేడియో ప్రీక్వెన్సిన్ ద్వారా వార్ షిప్ లు కొన్ని మాకు సిగ్నల్స్ ఇస్తున్నాయి.
అవతలికి వెళ్లిపోవాలని రాడార్ లను జామ్ చేస్తున్నారని తెలిపింది. గ్లోబల్ నావిగేషన్ ను కూడా చైనా జామ్ చేస్తోందని తెలిపింది. ఇంటర్నేషనల్ జీపీఎస్ సిస్టమ్ జామ్ అయిపోతే ప్రజల్ని ఎలా కాపాడగలం అంటూ పైలెట్లు వాపోతున్నారు. దక్షిణ చైనా సముద్రం, పిలిప్పీన్ ఏరియా, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో ఈ దారుణాలకు దిగుతోందని పెడరేషన్ పైలెట్స్ అసోసియేషన్ సంస్థ తెలిపింది. రోజు రోజుకు చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. భూమి, ఆకాశం, నీటిపై ప్రపంచమంతా మాదే హక్కని చైనా వితండవాదానికి దిగుతోంది.