పుష్ప సినిమాలో సమంత వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఇంకా ట్రెండీగా మారుతున్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సమంత పాటకు డాన్స్ వేయడం జరిగింది.. జాన్వి కపూర్ పసుపు కలర్ చీరలు కెమెరాకి ఫోజులు ఇస్తూ ఒక వీడియో ని కూడా తన ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేసింది.. అందులో జాన్వీ కపూర్ ఫోజులు ఇస్తూ.. ఊ అంటావా.. మావ ఊ ఊ అంటావా అనే సాంగ్ కి తన వేసే స్టెప్పులను సింక్ చేస్తూ వదిలింది.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతుంది.


జాన్వి కపూర్ పసుపు కలర్ చీరలో తెలుపు కలర్ జాకెట్ వేసుకుని ఈ వీడియో ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ పాటను చూసిన ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ఇక జాన్వికపూర్ ఎప్పుడు మోడ్రన్ డ్రెస్ లనే వేసుకుంటూ అలరిస్తూ ఉండే ఈమె తాజాగా చీరలో తన అందాన్ని అంత చూపిస్తు.. ఈ వీడియోకి హైలెట్గా నిలిచింది. ఇక తన హెయిర్ స్టైల్ తో జాన్వీకపూర్ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తోంది. ఇక తను వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక తన అందాన్ని కెమెరాలో బంధించారు. ఇక ఈమె అంతలా అందంగా కనిపించడానికి కారణం ఎవరంటే.. ఫేమస్ ఫ్యాషనిస్ట్ మనీష్ మల్హోత్ర ఈ శారీ ని డిజైన్ చేశారట.


జాన్వికపూర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో ఒక సినిమాలో నటిస్తోంది ఇక మరొక సారి కూడా అదే బ్యానర్ పై ఈ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. తాజాగా నటిస్తున్న గుడ్ లక్ జెర్రీ అని మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక దీనితో పాటే మిలీ అనే సినిమాలొ  కూడా నటిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఇక దక్షిణాది ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది జాన్వికపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: