మగాళ్ళు ఎలా మారుతున్నారు అంటే కామంతో కొట్టుకుంటూ మూర్ఖులు లాగా తయారవుతున్నారు.. పెళ్లి విషయం లో అయిన ప్రేమ విషయంలో అయిన సరే తప్పటడుగులు వేస్తున్నారు.. మనిషి జీవితం పెళ్లి అనేది ఒక్కసారే ఒక్కరితో జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ శాఖ లో పని చేస్తున్న ఉన్న ఓ ఉద్యోగి రెండో పెళ్లికి సిద్దమయ్యాడు.. వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా దాచేపల్లిలో పంచాయతీ సెక్రటరీ జాన్ పీరా నిర్వాకం బట్ట బయలైంది. కట్టుకున్న భార్య ఉండగానే..
మహిళా గ్రామ వాలంటీర్ తో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. మాయ మాటలు చెప్పి వాలంటీర్ను బుట్టలో వేసుకున్నాడు. తర్వాత రెండో పెళ్లికి సిద్ధమవ్వడం తో వాలంటీర్ సోదరుడు అశోక్.. గ్రామ సెక్రటరీని నిలదీశాడు. ప్రశ్నించిన పాపానికి అశోక్ పై సెక్రటరీ సోదరుడు కత్తి తో దాడికి తెగబడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జాన్ పీరా కు ఇప్పటి కే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మహిళా వాలంటీర్తో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. గతంలో సైతం గ్రామ సెక్రటరీ జాన్ పీరా పై పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. జాన్ పీరా లైంగిక వాంఛకు పలువురు మహిళలు బలైనట్లు తెలుస్తోంది.
వాలంటీర్ గా పనిచేసిన ఆయన అతని దగ్గర కు వచ్చిన మహిళలను ఏదోక మాట చెప్పడం అలా వారిని శారీరకంగా మానసికంగా లోబరుచుకుని లైంగిక కోరికలు తీర్చుకున్నాడు..అలాగే రాజకీయంగా కూడా జాన్ పీరా యాక్టివ్గా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రామ సెక్రటరీ నిర్వాహకంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అవసరానికి తన దగ్గరకు వస్తె ఆడవాళ్ల పై అసభ్యంగా ప్రవర్తిస్తూ న్నాడనీ జాన్ హీరాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాక అతనికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు..