రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మొత్తం మూడు మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఫ్లాప్ కావడంతో తన నెక్స్ట్ మూవీస్ పై గట్టిగా దృష్టి పెట్టిన ప్రభాస్, వాటితో ఎలాగైనా పెద్ద సక్సెస్ లు అందుకునేలా వాటి కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో పక్కాగా శ్రద్ధ పెట్టిన ప్రభాస్, తన క్యారెక్టర్స్ కోసం కూడా కష్టపడుతున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీ పై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం దాని యొక్క గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్చ్ వర్క్ జరుగుతోంది. కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. వీటితో పాటు సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కె కూడా చేస్తున్నారు ప్రభాస్. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

అయితే మ్యాటర్ లోకి వెళితే వీటిలో ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుండగా సలార్ మూవీ వచ్చే ఏడాది పక్కాగా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ రెండు మూవీస్ యొక్క రిలీజ్ కి సంబంధించి ఆయా యూనిట్స్ పక్కాగా రెడీ అవుతున్నాయట. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది బాక్సాఫిస్ బరిలో ప్రభాస్ వి రెండు మూవీస్ నిలవడం, అలానే ఆయన ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలతో పండుగ చేసుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉండడంతో, ఒకవేళ రెండూ కూడా సక్సెస్ కొడితే హీరోగా ప్రభాస్ క్రేజ్ మరింతగా దూసుకెళ్లడం ఖాయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: