సూపర్ స్టార్ మహేష్ బాబు
సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట
సినిమా తర్వాత మహేష్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ
మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్,
త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్నాడు. దాంతో ఈ మూవీపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ
మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో
టాలీవుడ్ హాట్
హీరోయిన్ బుట్టబొమ్మ
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా..సెకండ్
హీరోయిన్ గా శ్రీలీల కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈమధ్యనే ఈ
మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాని ఎన్నో భారీ అంచనాల మధ్య అన్ని కమర్షియల్ హంగులున్న మూవీగా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట
త్రివిక్రమ్ శ్రీనివాస్.ఇక క్రేజీ న్యూస్ ఏంటంటే మహేష్ ఫ్యాన్స్ దెబ్బకు
థమన్ అదిరిపోయే మ్యూజిక్ ని సెట్ చేసాడట. తప్పకుండ ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఖాయమటా.
ఇదిలా ఉంటే ఈ
మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం తెలుస్తోంది.ఇక ఉగాది పండగని పురస్కరించుకొని ఈ
సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారట. ఈ మూవీని ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఈమధ్యనే మహేష్ విదేశాలనుంచి తిరిగి వచ్చి ఈ
సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.ఇంకా అలాగే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తికాక ముందే ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ కంపెనీ
నెట్ ఫ్లిక్స్ తెలుగు తమిళం కన్నడ మలయాళ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈ
సినిమా తరువాత మహేష్ బాబు
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.