బుల్లితెర మీద తన హాట్ షోతో అదరగొట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ జబర్దస్త్ తో పాటుగా స్మాల్ స్క్రీన్ ని వదిలేసింది. అడపాదడపా అయినా అప్పుడప్పుడు స్మాల్ స్క్రీన్ పై కనిపించే అనసూయ ఈమధ్య బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోట్ అయిన అమ్మడు సినిమాల మీదే పూర్తి ఫోకస్ పెడుతుంది. అయితే అనసూయ ఆశించిన స్థాయిలో సినిమా ఛాన్స్ లు రావట్లేదు. ప్రస్తుతం పుషప్ 2, విమానం సినిమాలు చేస్తుంది. క్రిష్ తో అనుకున్న వెబ్ సీరీస్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

అందుకే అనసూయ సినిమాలతో పాటు మళ్లీ స్మాల్ స్క్రీన్ యాంకరింగ్ చేయాలని అనుకుంటుంది. అమ్మడు చేస్తానంటే ఛాన్స్ లు రావా చెప్పండి. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ లో ఒక షోని హోస్ట్ చేసేలా డిస్కషన్స్ నడుస్తున్నాయట. అనసూయ కూడా సినిమాల వల్ల వచ్చే మొత్తం సరిపోవట్లేదని బుల్లితెర మీద షోలకు రెడీ అవుతుందట. మరి అనసూయ నిజంగానే స్మాల్ స్క్రీన్ మీద షోలు చేస్తుందా లేదా ఇందతా ఒట్టి గాలి వార్తేనా అన్నది త్వరలో తెలుస్తుంది.

అనసూయ ప్రస్తుతం విమానం సినిమాలో సుమతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె మరోసారి తన హాట్ లుక్స్ తో అలరించనుంది. సినిమా ట్రైలర్ లో అనసూయ తన డైలాగ్ తో అందరిని మెప్పించింది. సినిమాల్లో తన పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా చేస్తున్న అనసూయ సినిమా హిట్ అయితే తన పాత్ర గురించి కూడా అందరు మాట్లాడుకునేలా చేయాలని అనుకుంటుంది.

అయితే ఎంత సినిమాలు చేస్తున్నా ఇన్నాళ్లు తనని ఆదరించిన బుల్లితెర ఆడియన్స్ ను బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ లో ఉంది అనసూయ. అందుకే ఏదైనా షో ఛాన్స్ వస్తే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందట. అంతేకాదు దానికి తగిన రెమ్యునరేషన్ కూడా వస్తుంది కాబట్టి సినిమాల గ్యాప్ తో ఇలా కూడా సంపాదించాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: