- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి ఆశలు పెట్టుకున్నారు. కానీ అంచనాలకు తగిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ప్రదర్శన పరంగా ఓ మోస్తరు ఫలితాన్ని నమోదు చేసుకుంది. అయితే సిద్ధు నటనకు మాత్రం ప్రేక్షకులు, విమర్శకులు కూడా ప్రశంసించారు. ఈ సినిమా తర్వాత సిద్ధు తన తదుపరి ప్రాజెక్టులపై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు. గతంలో ప్రకటించిన ప్రెస్టీజియస్ సినిమా ‘కోహినూర్’ ఇప్పుడు డైల‌మా లోకి వెళ్లినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందించాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో టీమ్ ఉంది. కానీ ప్రస్తుతం సిద్ధు కెరీర్ గ్రాఫ్ కొద్దిగా నెమ్మదించినందున, ఇంత భారీ పెట్టుబడి పెట్టడం రిస్క్‌గా భావిస్తున్నారని సినీ వర్గాల టాక్.


ఈ సినిమాను దర్శకుడు రవికాంత్ పెరిగంట ( క్ష‌ణం ఫేమ్) తెరకెక్కించాల్సి ఉంది. నిర్మాతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం కష్టమని భావించి, తాత్కాలికంగా నిలిపివేశారని వార్తలు వస్తున్నాయి. ఇక సిద్ధు జొన్నలగడ్డ మాత్రం నిరుత్సాహపడకుండా తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా సిద్ధు సూపర్ హిట్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కనున్న ‘టిల్లు క్యూబ్’ ( డీజే టిల్లు సీక్వెల్ ) పై భారీ అంచనాలు ఉన్నాయి. అదనంగా ఆయన ‘ బ్యాడాస్ ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కూడా నటించనున్నాడు. మొత్తం మీద, ‘కోహినూర్’ ప్రాజెక్ట్ అనిశ్చితిలో ఉన్నప్పటికీ, సిద్ధు జొన్నలగడ్డ తన ప్రత్యేక స్టైల్‌కి తగ్గ పాత్రలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని ప్లాన్ చేస్తున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: