తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే మరొకరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరచవ్చని ప్రచారం జరుగుతోంది. ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలు గుప్పుమన్నాయి.దీనికి కారణం ఆయన తన నియోజకవర్గంలోని ముఖ్యులతో , పార్టీ ప్రముఖులతో సమావేశం కావడమే.తమ భవిష్యత్ పై వారు చర్చలు జరిపారని అంటున్నారు.మళ్లీ మంగళవారం నాడు ఆయన మరో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మం కిషన్ రెడ్డి చేరితే పార్టీకి లాభం చేకూరుస్తుందని టీఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచనగా ఉంది.అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఖండించారు. నిప్పు లేనిదే పొగవస్తుందా? ఏమో..రాజకీయాలలో ఏమైనా కావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: