
సమావేశంలో సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, తురగా నాగభూషణం, లంక దినకర్, జమ్ముల శ్యామ్ కిషోర్, పాతూరి నాగభూషణం, కిలారు దిలీప్, మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.మొత్తం భేటీలో సోము వీర్రాజు పేరు ప్రస్తావనకు రాలేదని తెలిసింది. పార్టీ శ్రేణుల్లో చైతన్యం రావాలంటే పార్టీలో నాయకత్వ మార్పు రావాలని నేతలు పిలుపునిచ్చారు.ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సత్యకుమార్ ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించాలని, రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకు బాధ్యత వహించాలని పలువురు వక్తలు సూచించారు.దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని, సత్యకుమార్కు బాధ్యతలు అప్పగించాలని ఈ నేతలు పార్టీ హైకమాండ్పై ఒత్తిడి తీసుకువస్తారనే టాక్ వచ్చింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా విజయవాడలో ఒక హోటల్ లో సమావేశమైన నేతలు... జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అద్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకూమార్ కు ఆత్మీయసమావేశం పేరుతో ఎర్పాటైంది సభ. బిజెపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ పాతూరి నాగభూషణం మాజీ mla విష్ణు కుమార్ రాజు.. రమేష్ నాయుడు SK బాజీ శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు అయినట్లు సంచారం అందుతోంది.