ప్రాచీనకాలం నుంచి కూడా ప్రతి ఇంట్లోను పూజా మందిరాలు ఉంటూ వస్తున్నాయి. అప్పట్లో వంట గదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ వుండేవారు. ఇక ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది.అయితే ఉదయం వేళలోను ... సాయంత్రం వేళలోను పూజ పూర్తి చేసిన తరువాత, వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా? ... వేయకూడదా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతుంటుంది.

మరికొందరు దీపారాధన వుండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకూ ఆ తలుపులను తెరిచే వుంచుతుంటారు.ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు. ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది.


అలాగే దీపారాధన ఉన్నంత వరకూ తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని అంటోంది. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని స్పష్టం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: