ఇటీవల కాలంలో భారత జట్టులో ఎప్పుడెప్పుడు చోటు దక్కుతుందా అని ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్న ఆటగాళ్లు అందరూ కూడా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధపడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటి వరకు కేవలం ఐపిఎల్ లో ఛాన్స్ వచ్చినప్పుడు అదరగొడితే సరిపోతుంది అనుకునేవారు ఆటగాళ్లు. కానీ ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో కూడా ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా తమ ప్రతిభతో ఏకంగా తామే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక భారత సెలెక్టర్ల చూపును ఆకర్షిస్తూ టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేస్తున్నారు అని చెప్పాలి.


 ఇలా భారత జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లు మాత్రమే కాదు ఒకప్పుడు భారత జట్టులో చోటు సంపాదించుకుని ఇక ఆ తర్వాత ఫామ్ కోల్పోయి కనుమరుగైన వాళ్ళు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూ మళ్లీ తమ ఫామ్ నిరూపించుకుని టీమ్ ఇండియాలోకి వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఎంతోమంది ఆటగాళ్లు రాంజీ ట్రోఫీలో భాగంగా సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది ఆటగాళ్లు అయితే డబుల్ సెంచరీలు కూడా చేస్తూ ఔరా అనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే సైతం ఇక ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి.


 గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో అవకాశం కోసం నిరీక్షణగా ఎదురుచూస్తున్న మనీష్ పాండే ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా తనలో ఉన్న కసి మొత్తాన్ని బ్యాటింగ్ రూపంలో చూపించాడు. ఈ క్రమంలోనే ఏకంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో డబుల్ సెంచరీ చేశాడు అని చెప్పాలి. రంజీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్లో మనీష్ పాండే కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 183 బంతుల్లోనే 14 ఫోర్లు 11 సిక్సర్లతో 208 పరుగులు చేసి నాట్ అవుటుగా నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మనిషి పాండే అద్భుతమైన డబుల్ సెంచరీ పై ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: