
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు అన్న విషయం తెలిసిందే. ఆదివారం మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇక ప్రత్యేకంగా ఫైనల్ కోసం కేటాయించిన రిజర్వుడే అయినా సోమవారం మ్యాచ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇక ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకి 20 కోట్లు.. రన్నర్పుగా నిలిచిన టీం కి 13 కోట్లు ప్రైస్ మనీ గా ఇస్తారు అన్న విషయం తెలిసిందే.
ఈ ప్రైజ్ మనీ గురించి అందరూ చర్చించుకుంటూ ఉండగా.. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇక టైటిల్ విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎలా పెరుగుతూ వచ్చింది అన్నది హాట్ టాపిక్ గా మారింది. 2008లో ఐపిఎల్ మొదలైంది. అయితే మొదటి సీజన్లో టైటిల్ విన్నర్ గా నిలిచిన టీం కి.. 4.8 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేవారు. ఈ ప్రైజ్ మనీని 2010లో 10 కోట్లకు మార్చారు. ఇక 2013 సీజన్ వరకు ఇదే ప్రైజ్ మనీ కొనసాగగా.. 2014లో 15 కోట్లకు పెంచారు. ఇక ఆ తర్వాత 2016లో ఈ ప్రైజ్ మనీ 15 నుంచి 20 కోట్లకు మారింది. ఇక ఇప్పటివరకు కూడా ఈ 20 కోట్ల ప్రైస్ మనీనే కొనసాగుతుంది.