ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో దారుణము జరిగింది. చిన్నపాటి వివాదం జరగడంతో ఓ వ్యక్తి తన తోటి ఉద్యోగి తల నరికి ఖాళీ స్థలంలో పడేసిన‌ట్టు పోలీసులు  పేర్కొన్నారు.  నిందితుడు సందీప్‌గా గుర్తించారు పోలీసులు. సందీప్ అనే నిందితుడు తన తోటి ఉద్యోగి ప్రమోద్ కుమార్‌పై శత్రుత్వం పెంచుకొని అతన్ని హత్య చేయాలని ప‌థ‌కం ప‌న్నాడ‌ని ఎస్పీ  జ్ఞానేంద్ర సింగ్ మీడియాకు  వెల్ల‌డించారు. నిందితుడు సందీప్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసారు.

మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల స‌మ‌యంలో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రమోద్‌ కుమార్ ఈనెల 06న సోమ‌వారం రాత్రి మద్యం మత్తులో సందీప్ (35)ని కలవడానికి వెళ్లాడు. ప్ర‌మోద్‌ మద్యం మత్తులో ఉండడాన్ని అదునుగా భావించాడు సందీప్‌.  కుమార్‌ తల నరికి పాలిథిన్ సంచిలో చుట్టి శంకర్ విహార్ కాలనీలోని ఖాళీ స్థలంలో పడవేసాడ‌ని పోలీసులు వివ‌రించారు. ఘటన చోటు చేసుకున్న‌ రెండు గంటలకే కేవీ నగర్ పోలీసులు ఖాళీ స్థలం నుంచి ప్ర‌మోద్‌కుమార్ తలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: