సాధారణంగా రైలులో టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. చాలా మంది కూడా తమ ప్రయాణ టెన్షన్‌ నుంచి బయటపడడానికి ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటారు. ఈ రోజుల్లో పెరిగిన టెక్నాలజీ వల్ల చాలా మంది కూడా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం స్టేషన్‌లో తీసుకున్న టిక్కెట్లు త్వరగా కన్‌ఫామ్ అవుతాయనే ఉద్దేశంలో రైల్వే స్టేషన్‌లో టిక్కెట్లని బుక్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడి దాకా బాగానే ఉన్నా కొంత మంది మాత్రం తమ రైల్వే టికెట్లను పొగొట్టుకుంటూ ఉంటారు. బుకింగ్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు మెసేజ్ ఉంటే పర్లేదు కానీ ఆ అవకాశం కూడా లేకపోతే మాత్రం ప్రయాణించడానికి వీలు ఉండదు. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. పాసెంజర్లు పొగొట్టుకున్న టిక్కెట్లకు డూప్లికెట్ టిక్కెట్ ఇస్తామని పేర్కొంది. అయితే వాటికి నిర్ణీత సొమ్ము అనేది చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ డూప్లికెట్ టిక్కెట్ ఎలా పొందాలో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రయాణికులు రైల్వేకు కొంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ చార్ట్ సంకలనం చేయడానికి ముందు ధ్రువీకరించిన లేదా ఆర్ఏసీ టికెట్ కోల్పోతే సెకండ్ క్లాస్, స్లీపర్-క్లాస్ ప్రయాణీకులకు ఫీజు రూ. 50, మిగిలిన ఇతర తరగతులకు రూ. 100 చొప్పున ఫీజు చెల్లించి నకిలీ టిక్కెట్‌ను పొందవచ్చు. అయితే రిజర్వేషన్ చార్ట్ రూపొందించిన తర్వాత టిక్కెట్ పొగొట్టుకుంటే మాత్రం అసలు టిక్కెట్ ధరలో 50 శాతం డబ్బు చెల్లించి నకిలీ టిక్కెట్‌ను పొందవచ్చు.ఇక ఈ డూప్లికెట్ టిక్కెట్ ఎలాం పొందాలో? ఇప్పుడు తెలుసకుందాం.


ఇక రద్దుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ (ఆర్ఏసీ) టిక్కెట్లు చిరిగిపోయినా లేదా దెబ్బతిన్నా భారతీయ రైల్వేలు 25 శాతం ఛార్జీని చెల్లించి డూప్లికేట్ టిక్కెట్‌ను జారీ చేయవచ్చు.అయితే వెయిటింగ్ లిస్ట్‌లో దెబ్బతిన్న టిక్కెట్‌లకు మాత్రం డూప్లికేట్ టిక్కెట్లు మంజూరు చేయలేమని భారతీయ రైల్వే తెలిపింది.ఇంకా అంతేకాకుండా, టిక్కెట్ చెల్లుబాటు, ప్రామాణికతను నిర్ధారించగలిగితే, చిరిగిపోయిన లేదా దెబ్బతిన్న రైలు టికెట్ వాపసుకు అర్హతని పొందవచ్చు.అలాగే పోగొట్టుకున్న ఆర్ఏసీ టిక్కెట్ల కోసం, రిజర్వేషన్ చార్ట్ తయారు చేసిన తర్వాత డూప్లికేట్ టిక్కెట్లను క్రియేట్ చేయకూడదని రైల్వే తెలిపింది.అలాగే రైలు బయలుదేరే ముందు ఒరిజినల్ టిక్కెట్‌ను గుర్తించి డూప్లికేట్ టిక్కెట్‌తో పాటు అందిస్తే కస్టమర్ డూప్లికేట్ టిక్కెట్ ధరకు వాపసు పొందుతారని ఇండియన్ రైల్వే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: