తెలంగాణ సచివాలయం నిర్మాణం పూర్తయి ఇటీవల సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సెక్రటేరియేట్ నిర్మాణం లేదు. అసలు రాజధాని విషయంలో స్పష్టత లేక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు మేధావులు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో 2017 సంవత్సరం సచివాలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఫోస్టర్స్ అండ్ నార్మర్స్ సంస్థ ఒక చిత్రాన్ని తయారు చేసింది. ఇది ఏపీ రాజధాని కోసం మూడు నమూనాలను రూపొందించింది. అందులో ముఖ్యమైనది ఏమిటంటే పాలవాగు సమీపంలో ముఖ్యమంత్రి కార్యాలయం, మరో పక్క నాలుగు టవర్ల నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఇందులో ఎక్కువ మంది దీన్ని సెలక్ట్ చేశారు. 2017 లో దీన్ని ఫైనల్ చేశారు.


కానీ ఇప్పటి వరకు దాని నిర్మాణం జరగలేదు. 2018, 2019 లో సెక్రటేరియేట్ నిర్మాణం పూర్తి చేస్తే  చంద్రబాబు పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది. కానీ ఏపీ రాజధానిలో అన్ని తాత్కాలిక భవనాలను మాత్రమే నిర్మించారు. ప్రస్తుతం సరైన రాజధాని లేక, శాశ్వత సెక్రటెరియేట్ లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మారిన పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి ఇది పూర్తి చేయక, విశాఖపట్నంలో రాజధానిని నిర్మించాలని చూస్తున్నారు.


ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం, విదేశాలతో మార్కెటింగ్ వ్యవస్థ బాగుంటుంది. ముఖ్యంగా విశాఖ పట్నం డెవలప్‌ మెంట్ అయిన ప్రాంతం. కొత్తగా రాజధానిని నిర్మించాలంటే లక్షల కోట్లు కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఉన్న అతి పెద్ద నగరాన్ని విస్తరించి అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మరింత డెవలప్ చేస్తే విశ్వనగరంగా మార్చవచ్చు. దీనికి పెద్దగా సమయం పట్టదు. అల్రడీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో  తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. జగన్ ఆలోచనలు ఇలా.. చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉండటంతో ఏపీకి ఇంకా రాజధాని లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR