వైయస్ జగన్ చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు యువత ఏసీ ముందర కూర్చొని కంప్యూటర్ పెట్టుకొని లక్షల రూపాయల ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు. ఆ విధంగానే హైదరాబాద్ లో ఐటి,  సైబర్ సిటీ లాంటివి తీసుకువచ్చి అనేక మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశారు. ఆయనకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువత పట్టణాలకు వచ్చి పెద్ద ఉద్యోగాలు సాధించాలని పట్టణాలను అభివృద్ధి చేయాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు.  


హైదరాబాద్ ను  ఏ విధంగానైతే అభివృద్ధి చేశానో అమరావతిని కూడా అదే విధంగా చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతంలో కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు కల్పించాలని ఆశిస్తున్నారు. మచిలీపట్నం పోర్టును ప్రారంభించిన సమయంలో దాని చుట్టుపక్కల ఉన్న నాలుగు పోర్టులను కలుపుకొని అక్కడ దాదాపు 20 నుంచి 30 వేల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక వేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యమైతుందో తెలుసుకోవాలి.


యువత స్థానికంగా ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారా వారి అభిప్రాయాలు ఏమిటి వారు చదువుకున్న చదువుకు  లోకల్ లో ఉద్యోగాలు చేయడానికి ఎంతవరకు ఇష్టపడతారు. గతంలో లోకల్ గా పని చేసే వారికి డిగ్నిటీ ఆఫ్ లేబర్గా ఉండేది చిన్న కొబ్బరి బొండాల షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని కూడా గౌరవించేవారు. నేడు చిన్న ఉద్యోగాలు చేసే వారిని చిన్నచూపు చూస్తున్న తరుణం. ఇలాంటి సందర్భంలో లోకల్  ఉద్యోగాలకు యువత ఆసక్తి చూపిస్తారా అనేది తేలాల్సిన అంశం.అదే విధంగా యువతలో కాస్త మార్పు వచ్చింది.


గతంలో ఏ పని చేసినా ఉపాధి దొరికే పని చేస్తే అతడిని గొప్పగా చూసేవారు. కానీ ప్రస్తుత ఆ విధానాలు మారి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారే గొప్ప వారిగా చూస్తున్నారు. ముందు ఈ విధానాలు మారితేనే యువతకు ఉపాధి మార్గం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: