రష్మిక మందన కు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,  కన్నడ సినిమా అయిన కిరిక్ పార్టీ తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో  నటించిన మొదటి సినిమా ఛలో తోనే అదిరిపోయే విజయాన్ని తెలుగు ఇండస్ట్రీలో అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన ఆ తర్వాత నటించిన సినిమాల్లో కూడా ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విషయాలను అందుకోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో రష్మిక మందన క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది,  ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదలైన పుష్ప సినిమా ద్వారా రష్మీక మందన పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ సంపాదించుకుంది. 

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మీక మందన బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది,  అందులో భాగంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా రష్మీక మందన నటిస్తోంది.  అందులో భాగంగా సిద్ధార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన మిషన్ మజ్ను సినిమాలో రష్మీక మందన నటించింది,  ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది,  తాజాగా ఈ విషయాన్ని రష్మిక మందన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అఫీషియల్ గా తెలియజేసింది, ఇది ఇలా ఉంటే విజయ్ మొదటి సారి నేరుగా నటిస్తున్న తెలుగు సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: