పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా గురించి తెలియని వారంటూ లేరు. తండ్రికి తగ్గ తనయుడిగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తండ్రిలాగే బాక్సింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ అకీరాకు ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే. తండ్రిలా సిగ్గు పడటం, స్టైల్‌గా కనిపించడం అకీరా స్పెషాలిటీ. పవన్ కళ్యాణ్‌లా అకీరా దిగిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అకీరా చేసిన పనికి చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అకీరా ఏం పని చేశాడో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఓ లుక్కేయండి.


అకీరా మొట్ట మొదటిసారిగా రక్తదానం చేశాడు. ఈ విషయాన్ని అకీరా తల్లి రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా అకీరా రక్తదానం చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రేణుదేశాయ్ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ‘నాకు చాలా గర్వంగా ఉంది. 18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా మొట్ట మొదటిసారిగా రక్తదానం చేశాడు. రక్తం ఎంతో విలువైంది. అత్యవసర సమయంలో అవసరం ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైనది ఏమైనా ఉందంటే అది మన రక్తమే. 18 ఏళ్లు పైబడిన వారు మీకు వీలైనంత వరకు రక్తదానం చేయండి. దీని ద్వారా మీరు వేరొకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు.’ అని ఆమె పేర్కొన్నారు.


ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అకీరా చేసిన పనికి అటు అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, అకీరాతోపాటు కూతురు ఆద్యా ఫోటోలను, డైలీ ఈవెంట్స్ కు సంబంధించిన వీడియోలను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇటీవల అకీరాకు సంబంధించిన బాక్సింగ్ వీడియో వైరల్ అయింది. దీంతో అకీరా సినిమాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఇవి కేవలం రూమర్సేనని, అకీరా సినిమాల్లో రావడం లేదని రేణుదేశాయ్ స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: