సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ గా సర్కారు వారి పాట తో సూపర్ హిట్ కొట్టారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పరశురామ్ పెట్ల తీయగా థమన్ మ్యూజిక్ అందించారు. అందరి అంచనాలు అందుకుని సూపర్ హిట్ కొట్టిన సర్కారు వారి పాట చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక మూవీకి మహేష్ వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ లో అయితే భారీగా అంచనాలు ఉన్నాయి.

ఎన్నో ఏళ్ళ తరువాత మాటల మాంత్రికుడితో తమ హీరో పని చేస్తుండడంతో మరోవైపు ఆడియన్స్ కూడా ఈ ప్రతిష్టాత్మక మూవీ తప్పకుండ పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని నమ్ముతున్నారు. వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం అయిన ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దానికి కారణం స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదని కొందరు, త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ, స్క్రిప్ట్ లో మహేష్ కొన్ని సూచనలు చేయడంతో ఆలస్యం అయిందని మరికొందరు ప్రచారాలు చేస్తున్నారు. ఆ విషయాలు ప్రక్కన పెడితే, వాస్తవానికి ఈ సినిమాని పక్కాగా అనుకున్న టైంకి ప్రారంభించి పక్కాగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుపుతాం అని ఇటీవల ప్రకటించిన నిర్మాతలైన హారికా హాసిని క్రియేషన్స్ వారు లేటెస్ట్ గా మూవీని ఆగష్టు లో పట్టాలెక్కించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తాం అంటూ అఫీషియల్ ప్రకటన చేసారు.

దానితో ఒకింత మహేష్ ఫ్యాన్స్ లో నిరాశ వ్యక్తం అవుతోంది. అసలు ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా మధ్యలో ఎందుకు ఆలస్యం అయిందో, అలానే త్వరలో ప్రారంభం అయి పక్కాగా వచ్చే ఏడాది సమ్మర్ కి వస్తుందో రాదో అనేటువంటి అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం పక్కాగా సమ్మర్ బరిలో ఈ మూవీ నిలవడం ఖాయం అని తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: