సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా సినీ సెలబ్రిటీలు ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టారు అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీల సినిమా అప్డేట్ల గురించి మాత్రమే కాదు అటు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా అభిమానులు తెగ ఆసక్తి చూపుతూ ఉన్నారు. సెలబ్రిటీలు సైతం తమ పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.



 ఇక ప్రత్యేకంగా కొంత టైం ను కేటాయించుకొని మరి.. కొంతమంది ఏకంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. ఇకపోతే ఇటీవలే ఒక స్టార్ డైరెక్టర్ ఏకంగా తన వారసుడి పేరును రివీల్ చేయడంతో ఇక అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అట్లీ. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా తీస్తున్నాడు అట్లీ. దీంతో ప్రతి ఒక్కరీ చూపు కూడా ఈ డైరెక్టర్ పైన పడింది. ఎలాంటి కథను షారుఖాన్ కోసం అట్లీ సిద్ధం చేశాడో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు.



 ఇక షారుఖ్ ఖాన్ లాంటి హీరోతో అట్లీ ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అని కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రేజీ డైరెక్టర్ ఇటీవల తండ్రి అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అట్లీ భార్య ప్రియా మోహన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇటీవల తన కుమారుడి పేరును రివీల్ చేశాడు. భార్యతో కలిసి గుడికి వెళ్లి.. ఇక కుమారుడికి నామకరణం చేసాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా తన కుమారుడికి 'మీర్ 'అనే పేరును పెట్టినట్లు ఇటీవలే అట్లు అనౌన్స్ చేశాడు. దీంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అట్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: