టాలీవుడ్ లో యంగ్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా పైన భారీ ఎక్స్పరిటేషన్ పెట్టుకున్నారు అభిమానులు ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించడంతో అటు బాలీవుడ్ లో పాటు ఇతర భాషలలో కూడా మంచి హైప్ ఏర్పడుతోంది. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది.. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా సాంగ్స్ కూడా ఈ సినిమాను మరింత పాపులర్ అయ్యేలా చేశాయని చెప్పవచ్చు.



వరుసలాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కు ఆదిపురుష్ సినిమా ఒక గట్టి బూస్టుల ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే తిరుపతిలో ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున జరగడం జరిగింది. అయితే ఈవెంట్లో ప్రభాస్ పలు విషయాలను తెలియజేశారు. వచ్చె ఏడాది సలార్ -2 కూడా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు అంటూ తెలియజేశారు. అలాగే ఈ ఏడాది ఆది పురుష్.. మరియు సలార్ చిత్రాలు విడుదల కాబోతున్నాయని తెలియజేయడం జరిగింది..


వచ్చే ఏడాది డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్-k తో పాటు మారుతి మూవీ తో పాటు సలార్-2  కూడా ఉండబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. దీన్నిబట్టి చూస్తే వచ్చే ఏడాది ఈ ఏడాది ప్రభాస్ అభిమానులకు వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయని విషయాన్ని చెప్పగానే చెప్పినట్లు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో ఈ సినిమాలకు కూడా మంచి హైప్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ లు అయిపోగానే మరొక కొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ అభిమానులకు వచ్చే ఏడాదిలోపు నాలుగు సినిమాలను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: