వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారి పోయారని  విమర్శించారు. అంతేకాదు యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేక పోవడం ఆయన కర్మ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కారుస్తూ పగటి వేషగాడిలా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధాని అంశంలో  వ్యవహరిస్తున్న తీరుపై విజయసాయిరెడ్డి ట్విటర్‌లో స్పందించారు.


ఈ మేరకు విజయసాయిరెడ్డి ... ‘ ఇన్‌సైడర్ ట్రేడింగులో తన వాళ్లు కొన్న భూముల విలువ పెంచడానికి రాజధాని గురించి చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హైపర్ లూప్ రవాణా, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ... ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడ నివసించే వారి ఆయుష్షు పదేళ్లు పెంచడం...లాంటి నమ్మశక్యం కాని కోతలెన్నో కోశాడు’ అని  ట్వీట్‌ చేశారు. 

 

విజయసాయిరెడ్డి చంద్రబాబు తీరుపై ‘రాష్ట్రం నిప్పుల కుంపటి కాదు . ఐదేళ్ల మీ పాలనలో చంద్రబాబూ దోపిడీ, అరాచకాలకు అంతేలేదు. రావణ కాష్టంలా ప్రజలపై పది మరి వారిని  అలాగే  రాష్ట్రాన్ని మండించావు. ఇలా చేయడం వల్లే   ప్రజలు అందరూ కలిసి  నిన్ను తరిమి కొట్టారు’ అని  ఆయన ధ్వజమెత్తారు. 

 

ఇక ప్రస్తుతం వున్నా ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆయన ఇచ్చిన మాట అది కూడా తప్పలేదు ఇక మీదట కూడా   తప్పరని విజయసాయిరెడ్డి  ఈ సందర్బంగా తెలియజేసారు . నిజానికి సీఎం జగన్ కి   వారసత్వంగా వచ్చిన స్వభావమన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎప్పడూ మాట మీద ఉండరని.. అది ఆయన నక్కజిత్తుల కపట గుణమని విమర్శించారు. బాబు యూ-టర్నులతో కాలం వెళ్లదీస్తారని.. ఆయన మారాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. మీరు అలాగే ఉండండి అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: