
తమ సమస్యలు తీర్చాలని ప్రశ్నిస్తున్న ప్రజలపైనే ప్రస్తుత ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో జనంపైనే తిరిగి కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి అనే మాటే లేదని ఆరోపించారు సోము వీర్రాజు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగేలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని అని సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప... ఎలాంటి పనులు చేయటం లేదన్నారు. మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.