
యోగీ ఆదిత్యానాథ్ను అయోధ్య నుంచి బరిలో నిలపలాని బీజేపీ అగ్రనాయకత్వం శాయశక్తులా ప్రయత్నం చేసింది. చివరికి ప్రధాని నరరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా స్వయంగా రంగంలోకి దిగారు. కానీ... యోగీ మాత్రం తనను ఎంతగానో ఆరాధిస్తున్న గోరఖ్ పూర్ సదర్ నియోజకవర్గం నుంచే పోటీలో నిలిచారు యోగీ. 1989 తర్వాత ఈ నియోజకవర్గం నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే బీజేపీ ఓడిపోయింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాధా మోహన్ దాస్ అగర్వాల్ను తప్పించి యోగీ ఆదిత్యానాథ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో యోగీని ఓడించేందుకు ఇప్పుడు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా బరిలోకి దిగనున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా యోగిపై తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు చంద్రశేఖర్ ఆజాద్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆజాద్కు కూడా ఇదే తొలిసారి. తాను గెలిచినా, గెలవకపోయినా ఫర్వాలేదని, యోగి మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనేది తన పంతం అని అన్నారు.