ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లి నిన్న హైదరాబాద్లో ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఖరీదైన ఫంక్షన్ హాల్లో మంత్రి బొత్స కొడుకు వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వివాహానికి వెళ్లారు.
కేటీఆర్ రాకతో పెళ్లి ప్రాంగణంలో వాతావరణం మరింత సందడిగా మారింది. కేటీఆర్ను పలకరించేందుకు ఏపీ ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. మొత్తం వేడుకలో కేటీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆ వేడుకల వీడియోను కేటీఆర్ తన సోషల్ మీడియా ద్వారా ద్వారా పంచుకున్నారు. ఏపీ ప్రజాప్రతినిధులు చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని ఆ పోస్టులో తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజల మధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయన్నారు. కేవలం భౌగోళికంగానే ఏపీ, తెలంగాణ విడిపోయాయని ప్రేమలో కాదని అన్నారు కేటీఆర్.. నిజమే కదా..