ఇక టాలీవుడ్లో ప్రస్తుతం అలాంటి ఇబ్బందులనే సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్నూ ఎదుర్కుంటుందట. ఇకపోతే దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు రూపొందించిన సినిమా ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకి పరిచయమైంది తాప్సీ. కాగా మంచు మనోజ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించాడు.అయితే మొదటి సినిమాతో తాప్సీ బాగానే తన అందచందాలతో ఆకట్టుకుంది.ఇకపోతే దర్శకులతో పాటు హీరోలను బాగానే ఆకట్టుకుంది. ఇక దాంతో మొదటి సినిమా ఫ్లాపైనా హీరోయిన్గా అవకాశాలు బాగానే వచ్చాయి.కాగా వెంకటేశ్, రవితేజ, ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు బాగానే దక్కాయి.
ఇక ఆ సమయంలో తాప్సీ టైం బ్యాడ్. తను నటించిన ప్రతీ సినిమా ఫ్లాపైంది. అయితే ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో సెకండ్ లీడ్ చేసి మంచి పేరే తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం ప్రభాస్, కాజల్కే దక్కింది. చెప్పుకోవడానికి తాప్సీకి మిగిలిందేమీ లేదు.ఇక ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు అందుకొని సక్సెస్ సాధించింది. అయితే అదే సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక ఆ తర్వాత తాను స్వయంగా ఆయనతో మాట్లాడి సారీ చెప్పింది కూడా. ఇప్పుడు తాప్సీ కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా. అయితే మళ్ళీ తెలుగులో హీరోయిన్గా ట్రై చేస్తుందట.ఇదిలావుంటే ఇక్కడ నిర్మాతగానూ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. దర్శకేంద్రుడు దీనికి అడ్డుకట్ట వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.ఇక ఇది ఎంతవరకు నిజమోగానీ, తాప్సీ మాత్రం మళ్ళీ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ కావడం లేదని చెప్పుకుంటున్నారు..!