కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అమిగోస్.. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు.  ఈ సినిమాతో ఆశికా రంగనాథ్ అనే కన్నడ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయమయ్యింది.  జిబ్రాన్ సంగీతం అందించడం జరిగింది.  ఇకపోతే మైత్రి మూవీ రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో తోనే మంచి హిట్ టాక్  సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఫిక్సయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ అమిగోస్ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిన అని పిలుస్తోంది.. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమాలు రిలీజ్ కాకముందే తమ ఓటీటీ సినిమాలను ప్రకటిస్తున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో ఈ సినిమా కొన్ని వారాల తర్వాత అందులో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బిజినెస్ మాన్ గా,  మంజునాథ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా,  మైకేల్ అనే గ్యాంగ్ స్టార్ ఇలా మూడు సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.. ఈ ముగ్గురు ఒకరికొకరు ఎదురైన తర్వాత.. జరిగే సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించారు.. అసలు ఈ ముగ్గురికి రక్తసంబంధం ఉందా ? లేక పోలికలు మాత్రమే ఉన్నాయా?  అనేది ఈ సినిమా.. మొత్తానికైతే అమిగోస్ చిత్రంతో తన ఖాతా లో మరో విజయాన్ని వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతున్నాడు అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: