రాజకీయాలు తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఇరు రాష్ట్రాలలో సమీపంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలు మరియు కార్యాచరణ పై దృష్టి సారించాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ (ఇంతకు ముందు తెరాస) పార్టీ వేగంగా పావులను కదుపుతోంది. వరుసగా రెండు ఎన్నికలలోనూ విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ మరో మారు గెలిచి హ్యాట్రిక్ ను సాధించాలనే కసితో ఉన్నారు. గత రెండు ఎన్నికలలోనూ ఏ పార్టీ నుండి ప్రమాదం అనిపించలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం బి ఆర్ ఎస్ కు బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన వరుస ఉప ఎన్నికలలోనూ బీజేపీ బి ఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి రెండు ఉప ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. దానితో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుండి బి ఆర్ ఎస్ కు ప్రమాదం పొంచి ఉందని రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ను హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో బాగా బలపడుతోంది. ఇక అన్నింటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే తెరాస లో మంత్రిగా ఉండి కేసీఆర్ తో పొసగక రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఈటల రాజేందర్ ను బీజేపీ తెరాస పతనానికి వాడుకుంటుంది.

ఎందుకంటే దాదాపు చాలా కాలం తెరాస లో ఉన్న ఈటల రాజేందర్ కు కేసీఆర్ గురించి మరియు అతని రాజకీయ పరమైన వ్యూహరచనల గురించి అడుగడుగునా తెలిసి ఉంటుంది. అందుకే ఆ దిశగా తెలంగాణ బీజేపీ తమ ప్లాన్ లను అమలుచేయడానికి చూస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ నుండి బి ఆర్ ఎస్ మరియు కేసీఆర్ లకు ఎదురుదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీటిని కేసీఆర్ అండ్ కో ఏ విధంగా తిప్పికొడుతోంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: