ఇక చాలా మంది నొప్పులను తగ్గించడానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల అప్పటికప్పుడు నొప్పి తగ్గినప్పటికి వీటిని ఎక్కువగా వాడడం వల్ల ఖచ్చితంగా చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ పెయిన్ కిల్లర్ లను వాడే పని లేకుండా చక్కటి ఆయుర్వేద టిప్ ని వాడడం వల్ల మనం చాలా సులభంగా కీళ్ల నొప్పులను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు.ఈ టిప్ పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కీళ్ల నొప్పులను తగ్గించే ఈ ఆయుర్వేద టిప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం ఒక కప్పు నల్ల బెల్లం తురుమును, ఒక టీ స్పూన్ ఆర్గానిక్ పసుపును, పావు టేబుల్ స్పూన్ సున్నాన్ని ఇంకా అలాగే ఒక జాజికాయ పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో బెల్లం తురుమును అలాగే పసుపును వేసి కలుపుతూ వేడి చేయాలి. ఇక బెల్లం కొద్దిగా కరిగిన తరువాత సున్నాన్ని రెండు టీ స్పూన్ల నీటిలో వేసి కరిగించి వేసుకోవాలి.


ఆ తరువాత జాజికాయ పొడిని వేసి కలపాలి. దీనిని గోరు వెచ్చగా అయ్యే దాకా కలుపుతూ వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని చేత్తో తీసుకుంటూ కీళ్ల నొప్పులపై మీరు రాసుకోవాలి.రోజూ రాత్రి పడుకునే ముందు దీన్ని నొప్పులు ఉన్న చోట రాసుకుని దానిపై పట్టీని కట్టుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయి. ఈ టిప్ ని పాటించడంతో పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా వేడి చేసుకుని తినాలి. వీటిని రోజూ ఉదయం పూట పరగడుపున తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే వాతం కారణంగా కూడా శరీరంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా తలెత్తుతాయి. వెల్లుల్లి వాతాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. వాతం తగ్గడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా ఈ టిప్ లని పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం చాలా సులభంగా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: