ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1250 కోట్ల పైగా వసూళ్ళని రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనాలని చాలా బాగా ఆకట్టుకుంది.ఇక అంతేగాక ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.దాంతో చిత్రయూనిట్ పై ప్రపంచం మొత్తం కూడా ప్రశంసల వర్షం కురిపించింది. ఇప్పటికే పలువురు ఆర్ఆర్ఆర్ టీమ్ ను పర్సనల్ గా కలిసి అభినందించడం జరిగింది. తాజాగా మరో రాజకీయ ప్రముఖుడు కూడా ఆర్.ఆర్.ఆర్ టీమ్ ను అభినందించనున్నారు.మోడీ తరువాత చాలా పవర్ఫుల్ బీజేపీ లీడర్ అమిత్ షా..ఈయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఓ పక్క తన రాజకీయా కార్యక్రమాలు చేసుకుంటూనే ఇంకా మరో పక్క.. మన ఆర్.ఆర్.ఆర్ టీంను కలవనున్నారు.


ఆస్కార్ అవార్డు సాధించిన మన వారిని అప్రిషియేట్ చేయనున్నారు అమిత్ షా. ఇంకా అంతేగాక మనవాళ్లకు ఆయన విందు కూడా ఇవ్వనున్నారు.ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ సినిమా హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లని విడివిడిగా కలిసిన అమిత్‌ షా.. తాజా తను షెడ్యూల్‌ చేసుకున్న తెలంగాణ రాష్ట్ర టూర్లో.. ఆర్.ఆర్.ఆర్ టీంకు కూడా కాస్త చోటిచ్చారు. డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి అలాగే లిరిసిస్ట్ చంద్రబోసులను.. ఈ నెల 23 వ తేదీన కలవనున్నారు. ఆస్కార్ అవార్డు గెలిచి ఇండియా పేరును మరో సారి విశ్వవ్యాప్తం చేసినందుకు వీరందరికీ కూడా చిన్న పార్టీ ఇవ్వనున్నారు. అలాగే వీరితో పాటు విజయేంద్ర ప్రసాద్ కూడా ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ పెద్ద పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: