బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల 'పఠాన్' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు వరుస అపజయాలతో అభిమానులను భారీగా నిరాశపరిచాడు షారుఖ్ ఖాన్. దీంతో ఓ భారీ కం బ్యాక్ కోసం ఎదురుచూసిన షారుక్ ఖాన్ కి పఠాన్ ద్వారా ఆ విజయం దక్కింది. స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఈ సినిమాతో మళ్ళీ  హిట్ ట్రాక్ ఎక్కిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ని కనబరిచింది. 

ఇక ఈ సినిమాలో షారుక్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 2, 2023న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే పలు అనివార్య కారణాలవల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జవాన్ సినిమాను సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. అంతేకాదు జూన్ 2న విడుదల కావలసిన జవాన్ సినిమా మేకింగ్, వీఎఫ్ఎక్స్ లకు సమయం పట్టేలా ఉందని అందుకే రిలీజ్ వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక జూన్ నెల నుండి సెప్టెంబర్ నెలకి జవాన్ రిలీజ్ షిఫ్ట్ అవడంతో షారుక్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయసేతుపతి అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళతో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా స్పెషల్ అప్పీరియెన్స్ ఇవ్వబోతున్నారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: