పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్రో' సెట్స్ లో చిన్నపాటి గందరగోళం ఏర్పడినట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ తాజాగా తన మేనేజర్ తో గొడవ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల డేట్స్ విషయంలో మేనేజర్స్ ముఖ్యపాత్ర వహిస్తూ ఉంటారు. ఓ కథ వినాలన్నా, ఆ కథకి డేట్స్ అడ్జస్ట్ చేయాలన్న అంతా మేనేజరే దగ్గరుండి చూసుకుంటారు. అలా హీరో, హీరోయిన్లు అంతా మేనేజర్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే వీరిలో చాలామంది మేనేజర్ల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సాయి ధరమ్ తేజ్ తన మేనేజర్ తో గొడవపడ్డట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సాయితేజ్ మేనేజర్ పేరు సతీష్. ఇతను ఓ మెగా అభిమాని.

 ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సతీష్ ను సాయి ధరమ్ తేజ్ తన వద్దె మేనేజర్ గా పెట్టేసుకున్నాడు. నిజానికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు. తాజాగా సాయి ధరం తేజ్ బ్రో మూవీ సెట్స్ లో మేనేజర్ సతీష్ పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. కారావాన్ లోనే సాయి తేజ్, సతీష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. ఇందుకి6 కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. బ్రో సెట్స్ లో సాయి తేజ్, సతీష్ ల మధ్య గొడవ జరగడంతో ఒక్కసారిగా సెట్స్ లో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఇక సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి మేనేజర్ సతీష్ ప్రతి విషయాన్ని దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు.

ఇటీవల సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ షూటింగ్లోనూ, సినిమా ప్రమోషన్స్ లోనూ సతీష్ సాయి ధరం తేజ్ వెంటే ఉన్నాడు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటా అంటూ ఇండస్ట్రీలో కొందరు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక బ్రో మూవీ విషయానికొస్తే.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

BRO