
రాజస్థాన్ పరిణామాలను విశ్లేషిస్తూ, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ యొక్క అధికార పత్రిక అయిన `సామ్నా` తన ఎడిటోరియల్లో హాట్ కామెంట్లు చేసింది. ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని బీజేపీపై మండిపడింది. రాజకీయ వికృత చేష్టలు ఓడిపోయాయని పేర్కొంటూ బీజేపీకి రాజస్థాన్ సీఎం గెహ్లాట్ గుణపాఠం నేర్పారని విశ్లేషించింది. రాజస్థాన్లో తాజా విఫల యత్నంతో రాజకీయ అనైతిక చేష్టలకు పరాభవం ఎదురైంది. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గెహ్లాట్ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అంటూ ప్రశంసించింది.
ఆపరేషన్ లోటస్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆపరేషన్ నిర్వహించారని ప్రశంసించడంతో పాటుగా తమ రాష్ట్రంలోని పరిణామాలను విశ్లేషించింది. ‘మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఆపరేషన్ ఫెయిలైంది. ఇప్పటికైనా బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలి. ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడంతో బీజేపీ బిజీగా ఉంది. ఇది రాజకీయ మానసిక అనారోగ్యానికి సూచన కాదా? షోలే ఫిల్మ్లో గబ్బర్ సింగ్లా ఆపరేషన్ లోటస్ అనే తీవ్రవాదాన్ని సృష్టించారు. `` అంటూ మండిపడింది. మహారాష్ట్రలో ఆపరేషన్కు కొత్త డేట్ సెప్టెంబర్ అని తెలుస్తోంది అంటూ సామ్నా మహారాష్ట్ర సర్కారు గురించి డౌట్లు రేకెత్తించింది. దేశంలో కరోనా ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. నిరుద్యోగం పెరుగుతోంది. ఎకానమీ కుంటుపడుతోంది. దాన్ని కాపాడే బదులు ఇతర ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు అంటూ విరుచుకుపడింది.