ఆడ పిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అని సంతోష పడే వాళ్ళు.. కానీ ఇప్పుడు భయం తో వణికి పోతున్నారు. బిడ్డ జీవితం ఎవరి చేతిలో నలిగి పోతుందో అని మదన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలను తీసుకుంటూ వస్తున్నా కూడా రాక్షసుల బుద్ది మారడం లేదు. ఐదు నిమిషాల పడక సుఖం కోసం వావి, వరుసలు మరచి పశువులు లాగా రెచ్చిపోతున్నారు. వయస్సు తో పని లేకుండా కనిపించిన ఆడదాన్ని చెరబడుతున్నారు.

నిర్భయ, దిశ లాంటి అమాయకపు అమ్మాయిలు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. అయిన దేశం లో గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే వున్నాయి. పోలీసులు దారుణ శిక్షలు వేస్తున్నా కూడా కామంధులు వెనక్కి తగ్గడం లేదు. నిన్న కాక మొన్న జరిగిన గ్యాంగ్ రేప్ మరువక ముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడి కూతురు ను నమ్మించి దారుణంగా రేప్ చేసిన ఘటన చోటుచేసుకుంది.. 

వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో జరిగింది.స్నేహితుడి కూతురును సొంత కూతురు లాగా చూడాల్సిన వారే చిదిమేశారు. ఏమి తెలియని 11 ఏళ్ల పసి బిడ్డ పై పశు వాంచన తీర్చుకున్నారు. 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక పై 20 ఏళ్ల పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా రేప్ చేశారు. ఈ ఘటన ను ప్రత్యక్షంగా చూసిన ఓ మహిళ బాలిక ను తీసుకొని కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకెల్లింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. భాధితురాలికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: