భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమా రంగ్ దే చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఇక ఈ సినిమాతో పాటుగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో అందాదున్ రీమేక్ లో నటిస్తున్న నితిన్.. చంద్ర శేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. వీటితో పాటుగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో పవర్ పేట సినిమా ఫిక్స్ చేసుకున్నాడు నితిన్. ఈ సినిమాలో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారట. 

 

అదేంటి రెండు పార్టులుగా చెప్పే కథగా పవర్ పేట వస్తుందట. సినిమా అంచనాలకు తగినట్టుగానే క్రేజీగా ఉంటుందని అంటున్నారు. ఒక కథ రెండు పార్టులు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే సినిమా బాహుబలి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ముందు ఒక సినిమాగానే చేయాలని అనుకున్నారు కానీ సినిమా రష్ ఎక్కువ అవడంతో మధ్యలోనే సినిమాను రెండు పార్టులుగా తీసేలా ప్లాన్ చేశారు. బాహుబలి తర్వా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. 

 

ఇక ఇప్పుడు పవర్ పేట కూడా రెండు పార్టులుగా వస్తుందట. భీష్మ హిట్ తో తన సత్తా చాటిన నితిన్ పవర్ పేటలో ఓ కొత్త ప్రయోగమే చేస్తున్నాడని అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పవర్ పేట నితిన్ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు. కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ ఆల్రెడీ ఛల్ మోహన్ రంగ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అవగా ఈసారి ఈ ఇద్దరు కలిసి అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: