టాలీవుడ్
సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు
సుధీర్ బాబు. మహేష్ బాబు బావ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తనకంటూ సొంత టాలెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి చూశాడు. ఇప్పటివరకు చాలా సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆయన హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్
సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పలాస 1978 కరుణ
కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో
సుధీర్ బాబు నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు.
ఇక
సుధీర్ బాబు కు ఈ
సినిమా హిట్ తప్పనిసరి అయ్యింది. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయిన
సుధీర్ బాబు ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కరుణ
కుమార్ రచించిన అద్భుతమైన స్టోరీ ని ఎంపిక చేసుకుని ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో
హీరోయిన్ గా ఆనందినటిస్తుంది. 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై
విజయ్ జిల్లా శశి దేవి
రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27 న విడుదల అవుతోంది..
దాంతో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా శరవేగంగా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.
ప్రభాస్ గురించి
సుధీర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సుధీర్ బాబు
ప్రభాస్ ఇంటికి వెళ్లాను. రచికరమైన భోజనం పెట్టాడు. వారంలో ఒకరోజు
ప్రభాస్ ఇంటికి వెళితే వర్కౌట్ లు గట్రా ఏమీ ఉండవు. అన్ని గల్లంతే అవుతాయనీ సరదాగా కామెంట్ చేశాడు.
ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ
ప్రభాస్ ను ఎంతలా ఇష్ట పడతారో అంతలా ఆయన పెట్టే భోజనం ను కూడా ఇష్టపడతారు. ఆయన గురించి ఎవరు మాట్లాడినా ముందుగా చెప్పే విషయం భోజనం గురించే. అతిథులకు ఇలా చేయడం
ప్రభాస్ స్పెషాలిటీ అని చాలామంది చెప్పారు. గతంలో
ప్రభాస్ ఆతిథ్యం పుచ్చుకున్న వారు కూడా ఇదే వెల్లడించారు.