ఆచార్య సినిమా విడుదలైంది. విడుదలైన తర్వాత కనీసం మెగా ఫ్యామిలీనుంచి ఒక్క ట్వీట్ కూడా పడలేదు. హీరోలిద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. కొత్త సినిమాలు రిలీజైతే చాలు సోషల్ మీడియాలో హడావిడి చేసే చిరంజీవి, రామ్ చరణ్ కూడా తమ సొంత సినిమా గురించి ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు. పోనీ వీరు ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటారా అంటే అలా చెప్పలేం. మెగా ఫ్యామిలీ సినిమాలకు బాగానే ఎలివేషన్లు ఇస్తుంటారు. కానీ ఆచార్య రిలీజ్ తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు.

ఆచార్య సినిమాకు ముందు రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గానే ఉన్నారు. షూటింగ్ విశేషాలన్నీ ట్విట్టర్లో పంచుకునేవారు.


కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. కనీసం హీరోలయినా సినిమాను ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడంలేదు. ఇలా సినిమాని గాలికొదిలేస్తే ఆ భారాన్ని మోసేది ఎవరు.

ఆచార్యకు తొలిరోజే కాస్త డివైడ్ టాక్ వచ్చినమాట వాస్తవమే. అంత మాత్రాన ఎవరూ సినిమాలను అలా వదిలేయరు. డివైడ్ టాక్ వస్తే మరింత జాగ్రత్తపడతారు. సక్సెస్ టూర్లు, సక్సెస్ మీట్ లు అంటూ హడావిడి చేస్తారు. కానీ మెగా హీరోలిద్దరూ ఆ విషయాన్ని పక్కనపెట్టారు. సినిమా రిలీజ్ కి ముందు ఎంత చేయాలో అంతా చేశారు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం మౌనం దాల్చారు. వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే కొణిదెల బ్యానర్ నుంచి నేరుగా కొణిదెల నిర్మాణ ఖర్చులతో వచ్చిన సినిమా అయ్యుంటే ఇలా చేసేవారా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మొత్తమ్మీద ఆచార్య సినిమాకి ముందు మెగా ప్రమోషన్, ఆచార్య సినిమా తర్వాత మెగా సైలెన్స్ అన్నట్టుగా ఉంది వ్యవహారం.

అటు ఫ్యాన్స్ కూడా ఆచార్య సినిమాతో డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. పైగా పదో తరగతి పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ దశలో కలెక్షన్లపై కూడా ఆప్రభావం కనిపిస్తోంది. అందులోనూ ఇటీవలే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి పెద్ద సినిమాలొచ్చాయి. ఆ తర్వాత ఆచార్య కూడా ఆ స్థాయిలో అలరిస్తుందని అనుకున్నారు. అంచనాలు తప్పినా ప్రమోషన్ ని కూడా మెగా ఫ్యామిలీ పక్కనపడేయడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: