మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించగా మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించాడు. చిరంజీవి కి వీరాభిమాని అయినటువంటి బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వాల్టేరు వీరయ్య మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... మహతీ స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో చిరంజీవి తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి మూవీ ని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ దర్శకుడు చిరంజీవి కి ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన చిరంజీవి ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా రూపొందిన సోగ్గాడే చిన్నినాయన ... బంగార్రాజు మూవీ లకు ఈ దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు కూడా ఈ దర్శకుడు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: