మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'SSMB28' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న మూవీ యూనిట్.. తాజాగా నాలుగో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్లో భాగంగా మహేష్, పూజ హెగ్డే లపై ఓ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నారట. రామోజీ ఫిలిం సిటీ లో ఈ సాంగ్ ని షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సాంగ్లో చాలా స్పెషాలిటీస్ ఉండబోతున్నాయట. ఇదొక రెయిన్ సాంగ్ అని తెలుస్తోంది. ఫుల్ వర్షం లో పున్నమి వెన్నెలలా ఈ సాంగ్ ఎంతో రొమాంటిక్ గా సాగనుందట. 

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కలయికలో వచ్చిన 'ఆకు చాటు పిందె తడిసే' సాంగ్ రేంజ్ లో ఈ పాట ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ హెవీ రెయిన్ సాంగ్ లో పూజ హెగ్డే పల్చని తెల్లని చీరలో తన అందాలు అడ్డు అదుపు లేకుండా ఆరబోస్తుందట. అలాగే ఈ పాటలో మహేష్, పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ ని చాలా క్లోజప్ షాట్స్ లో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ రెయిన్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతోందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు రొమాంటిక్ రెయిన్ సాంగ్స్ లో నటించింది లేదు. అది కూడా పూజా హెగ్డేలాంటి హాట్ హీరోయిన్ తో కలిసి వర్షంలో రొమాంటిక్ సాంగ్ అంటే..

కచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమానంతరం రాజమౌళితో మహేష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టు పైకి వెళ్లాల్సి ఉంది. అందుకే త్రివిక్రమ్ అంతకంటే ముందే మహేష్ తో సినిమా షూటింగ్ని కంప్లీట్ చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్యానెల్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత లాంగ్ గ్యాప్ తో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: