ఈ రోజు ఐపీఎల్ సీజన్ 15 లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్న లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్యన ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం లో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు కూడా కొత్త కెప్టెన్ లు ఉండడం విశేషం. కాగా ఇరు జట్లు ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై కె కె ఆర్ చేతిలో అలాగే లక్నో గుజరాత్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కాబట్టి దెబ్బ తిన్న పులిలా ఈ రోజు బరిలోకి విజయమే లక్ష్యంగా తలపడనున్నారు. ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం. ఈ రోజు మ్యాచ్ లో చెన్నై జట్టుకు ఒక శుభపరిణామం ఉంది, స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ అందుబాటులో ఉన్నాడు.

నిన్నటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు ఛేజింగ్ జట్లు గెలిచాయి. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అందుకో ఈ మ్యాచ్ లో కూడా మొదట టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపుతుంది. అయితే ఏ జట్టు టాస్ గెలుస్తుందో అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఇరు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు ఎవరని చెప్పుకుంటే, చెన్నై లో జడేజా, ధోని, మొయిన్ అలీ మరియు బ్రేవో లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజయం నల్లేరు పై నడకే. కానీ జడేజా కెప్టెన్ అయిన తర్వాత దూకుడు తగ్గించాడని తెలుస్తోంది. ఎందుకంటే గత మ్యాచ్ లో ఒక వైపు ఎప్పుడూ స్లో గా ఆడే ధోని తన బ్యాట్ ను జులిపిస్తుంటే జడేజా మాత్రం నెమ్మదిగా ఆడడం ఆశ్చర్యంగా అనిపించింది. మరి ఈ మ్యాచ్ లో అయిన తన మెరుపులు ఉంటాయా చూడాలి.

ఇక లక్నో టీమ్ విషయానికి వస్తే, వీరికి తమ కెప్టెన్ రాహుల్ బలం మరియు బలహీనత. కాబట్టి ఈ మ్యాచ్ లో పూర్తిగా తన ఆలోచనా విధానం, ఆడే తీరు అంతా మార్చుకుని ఒక్క ప్రయత్నం చేస్తే జట్టు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు అయిన డి కాక్, లూయిస్, రాహుల్ మరియు మనీష్ పాండే లు రాణించాల్సి ఉంది.

మరి ఈ మ్యాచ్ లో ఎవరు సరైన ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో ఖాతాను తెరుస్తారో చూడాలి.


   

టీడీపీ నేత అజీజ్: జగన్.. "మేక తోలు కప్పుకున్న పులి"

ఏపీలో

 

మరింత సమాచారం తెలుసుకోండి: