
అయితే మొన్నటి వరకు టెస్ట్ టి 20 ఫార్మాట్లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ ఇక వన్డే ఫార్మాట్లో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగాడు. అంతేకాకుండా ఇక రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో ఏకంగా కెప్టెన్ గా కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. ఏకంగా శిఖర్ ధావన్ కెప్టెన్సీ లో అటు టీమిండియా వరుసగా సిరీస్ లు గెలిచింది. అయితే కేవలం ఆటలో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు ఈ క్రికెటర్. ఎప్పుడు తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఇక అభిమానులను అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే శిఖర్ ధావన్ ఏదైనా పోస్ట్ పెట్టాడంటే చాలు అది చూసి తెగ ఆనంద పడిపోతూ ఉంటారు.
ఇకపోతే ఇటీవలే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శిఖర్ ధావన్. అయితే శిఖర్ ధావన్ శరీరంపై పలుచోట్ల టాటూలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే 15 ఏళ్ల క్రితం మనాలి టూర్కు వెళ్ళినప్పుడు అక్కడ టాటూలు వేయించుకున్నట్లు ఇటీవల గుర్తు చేసుకున్నాడు. అయితే టాటూ వేయించుకున్న తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాడట శిఖర్ ధావన్. ఎందుకంటే ఒకరికి వేసిన టాటూ సూదితోనే మరొకరికి వేస్తారని తెలిసి భయపడ్డాను. నాలుగు నెలల తర్వాత హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నాను. కానీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న అంటూ అటు శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.