అప్పటిలో పెళ్ళి జరుగుతుంది అంటే ఎన్నో సరదాలు ఎదురయ్యేవి.. ఎన్నో విషయాలు బంధువులు పంచుకునే వాళ్ళు.. పెళ్ళి తర్వాత జరిగే ఆటలు కూడా భార్యాభర్తలకు అవగాహన కలిగించే వాళ్ళు. ఎంతో పద్దతిగా మొదటి రాత్రి చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళి అనేది షాట్ పిరియడ్ లో జరుగుతుంది. ఇక హనీమూన్ అంటూ టూర్ లు వేస్తున్నారు. ఈ ట్రిప్ కు కొత్తగా పెళ్ళయిన వాళ్ళు వెళితే సరదా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వింత ఘటన ఎదురైంది. 



స్నేహితుల తో కలిసి వెల్దామని చెప్పిన భర్త మాటలు విని భార్య ఖంగుతింది. పెళ్ళికి ముందు 7నెలలు ఉందనగా ఈ ట్రిప్ గురించి ఇద్దరూ కలిసి తెగ ప్లాన్లు వేశారు. అనుకున్న విధంగా ఒక స్పాట్ ను ఎంచుకొని అక్కడ ఎలా ఎంజాయ్ చేయాలనీ ఆలోచిస్తుండగానే పెళ్ళి అయ్యింది. అనుకున్న విధంగా హనీమూన్ అనుకున్నారు. ఈ విషయం గురించి అబ్బాయి స్నేహితుల తో పంచుకున్నాడు. 



ఆ ప్లేస్ పేరు వినగానే మేము అక్కడకు రావాలని అనుకుంటున్నాము. అందరం కలిసి వెల్దామని చెప్పారు. అతను వద్దని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు వినలేదు. స్నేహితుల కోరికను కాదనలేకపోయిన ఆ వ్యక్తి.. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆమెకు ఈ మాట వినగానే ఫ్యుజులు ఎగిరి పోయాయి. నీకు ఏమైనా పిచ్చి నా.. అంటూ కోపంతో ఊగిపోయింది. బండ బూతులు తిట్టింది. ఆ ఐడియా వచ్చినందుకు అతడ్ని తిట్టిపోసింది. అప్పటికి కూడా ఆ వ్యక్తి ఆమెను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాడు.. చివరికి ఫెయిల్ అయ్యాడు.. 

అలా మొత్తానికె రద్దు అయ్యింది. కాశీకి పోతూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళడం అవసరమా.. నువ్వు ఎం మగాడివి అంటూ.. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు వింత వింత కామెంట్స్ పెడుతున్నారు. అలా ఇది కాస్త వైరల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: