సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి  అందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు త్రివిక్రమ్. దీంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫస్ట్ లుక్ లో మహేష్ బాబుని ఎప్పుడూ లేనివిధంగా చూపించడు త్రివిక్రమ్. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలో మరింత పెరిగిపోయాయి.

 ఈ క్రమంలోని ఈ సినిమా గ్యారెంటీ అని అంటున్నారు ఘట్టమనేని అభిమానులు ఈ క్రమంలోనే మహేష్ బాబు అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు.ఈ క్రమంలోని మహేష్ బాబు తీరు చూస్తుంటే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడం కష్టమే అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని మూడు నెలలు పోస్ట్ ఫోన్ చేయాలని మహేష్ బాబు త్రివిక్రమ్ కి చెప్పినట్లుగా వార్తలు అయితే వినబడుతున్నాయి.

ఇందుకు ముఖ్య కారణం సమ్మర్ అని తెలుస్తోంది. మహేష్ బాబుకి స్కిన్ ఎలర్జీ ఉందని.. ఎందుకుగాను వేసవికాలంలో షూటింగ్స్ చేయడు అని.. ప్రతి సమ్మర్ కి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్లని ఎంజాయ్ చేస్తాడు అని .ఎప్పటిలాగానే ఈసారి కూడా రెండు మూడు వారాలపాటు కచ్చితంగా వెకేషన్కు వెళ్ళిపోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమా రిలీజ్ కి సంక్రాంతి వరకు టైం ఉంది.కాబట్టి మహేష్ బాబు ట్రిప్ కి వెళ్ళిన కూడా సినిమాకి ఇది పెద్ద అడ్డంకి కాదని అంటున్నారు. మహేష్ బాబు 100 రోజుల షూటింగ్ చేస్తే మిగిలిన 264 రోజులు ఫారిన్ ట్రిప్స్ లోనే గడుపుతాడు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్లో పడ్డారు సూపర్ స్టార్ అభిమానులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: