నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది.


మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో హనీ రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు కూడా దక్కాయి.


 చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" లో కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బుల్లి తెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం అయింది. ఈ మూవీ స్టార్ మా చానల్లో మొదటి సారి ప్రసారం అయినప్పుడు 8.83 "టీ ఆర్ పి" రేటింగ్ ను సంపాదించుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: