
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో హీరోయిన్ గా అయితే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకుంది. తన అందం తో కూడా మరింత మెప్పించింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ అంత సక్సెస్ అయితే అందుకోలేదు. మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో కూడా ఆమె నటించింది. కానీ ఈమెకు అంతగా అవకాశాలు రాలేకపోయాయి. దీంతో ఏమీ చేయలేక.. సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పింది..ఆ తర్వాత కొంతకాలానికి లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిందని తెలుస్తుంది.. తనకు ఒక పాప, బాబు కూడా ఉన్నారటా.. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో లండన్ లోనే ఉంటుంది. సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ కూడా చేస్తుందని తెలిసింది. హీరోయిన్ లు వేసుకునే దుస్తులను తిరిగి మళ్లీ డిజైనింగ్ చేయించి తిరిగి సేల్ చేస్తుందని సమాచారం.. ఇక సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక తను చేసిన సినిమాల రీల్స్ వీడియోలను కూడా బాగా రీస్టోరీ పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫొటోస్ కూడా ఆమె పంచుకుంటుంది. ఈ వయసులో కూడా తను చాలా అందంగా, మంచి ఫిజిక్ ను కూడా మైంటైన్ చేస్తుంది.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్ పంచుకుంది. అయితే అందులో తనకు సంబంధించిన ఒక ఫోటో మాత్రం వివాదం సృష్టించింది. అదేంటంటే హిందువులు మొదటి దైవంగా భావించే వినాయకుడి విగ్రహం దగ్గర అన్షు ఎత్తు చెప్పులు వేసుకుని మరి కెమెరాకు ఫోజ్ ను ఇచ్చింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్స్ ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారటా.. దేవుడి దగ్గర చెప్పులు వేసుకోవడం ఏంటి అంటూ కోపంతో మండి పడుతున్నారు.