
అలాగే నీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం ఎలా చేసుకోవాలనే వాటి గురించి కూడా మాట్లాడుకున్నాము.. ఈ ప్రాజెక్టులకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. శ్రీశైలం గురించి మాట్లాడుకున్నాము అంటూ తెలియజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు కూడా ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందంటూ తెలిపారు రేవంత్ రెడ్డి .బనకచర్ల గురించి అసలు ప్రస్తావనే లేదంటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనకచర్ల మీదన కమిటీ వేయబోతున్నారని.. ఈనెల 21వ తేదీన వివాదానికి పరిష్కారం చెప్పబోతున్నారంటూ తెలిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎజెండలో ఫస్ట్ పాయింటే బనకచర్ల ఉండేది. ఈ విషయాన్ని హరీష్ రావు రైజ్ చేస్తూ.. రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ?
ఏదైతే చంద్రబాబు, రేవంత్ ల సంబంధాన్ని అక్కడ వివాదంగా మలిచారు. చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారన్నటువంటి తరహాలో క్రియేట్ చేసేటువంటి పని బిఆర్ఎస్ చేసింది అక్కడ. అందుకు సంబంధించి హరీష్ రావు మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది తెలంగాణ సీఎంకు పెద్ద షాకే అని చెప్పవచ్చు.